ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ పోటీలో టీమిండియా ఓపెన‌ర్

-

అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్లేయ‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ తో పాటు ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డుల‌ను కూడా ఇటీవ‌ల ప్రారంభించింది. ప్ర‌తి నెల అంత‌ర్జాతీయ క్రికెట్ లో ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చేసిన వారికి ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ ను ఐసీసీ అంద‌జేస్తుంది. అయితే గ‌త ఏడాది డిసెంబ‌ర్ నెల‌కు సంబంధించి ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ రేస్ లో ఉన్న ఆట‌గాళ్ల పేర్ల‌ను ఐసీసీ విడుద‌ల చేసింది. డిసెంబ‌ర్ నెల‌కు నామినేట్ అయిన వాళ్లల్లో ఇండియ‌న్ టెస్టు క్రికెట్ ఓపెన‌ర్ మ‌యాంక్ అగ‌ర్వాల్ కూడా ఉన్నారు. మ‌యాంక్ తో పాటు న్యూజిలాండ్ స్పిన్న‌ర్ అజాజ్ ప‌టేల్, ఆస్ట్రేలియా బౌల‌ర్ మిచెల్ స్టార్క్ ఉన్నారు.

టీమీండియా నుంచి రోహిత్ శ‌ర్మ‌, శుభ‌మాన్ గిల్ తో పాటు కెఎల్ రాహుల్ కూడా కొన్ని మ్యాచ్ ల‌కు దూరంగా ఉన్నారు. దీంతో మ‌యాంక్ అగ‌ర్వాల‌కు అవ‌కాశం వ‌చ్చింది. అయితే మ‌యాంక్ అగ‌ర్వాల్ త‌న అవ‌కాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సౌతాఫ్రికా టెస్టు సిరీస్ లో మ‌యాంక్ అగ‌ర్వాల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన రెండు టెస్టుల‌లో 276 ప‌రుగుల‌ను మ‌యాంక్ సాధించాడు. అలాగే యాషెస్ సిరీస్ లో మిచెల్ స్టార్క్ ఆల్ రౌండ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నాడు. అలాగే ఇండియా – న్యూజిలాండ్ మ‌ద్య జ‌రిగిన టెస్టు సిరీస్ లో న్యూజిలాండ్ స్పిన్న‌ర్ ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసి ఆక‌ట్టుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news