టెక్కలి వైసీపీ అభ్యర్థిపై వీడిన సస్పెన్స్ …

-

ఆంధ్రప్రదేశ్ లో 2024 జరగనున్న ఎన్నికల గురించి అందరిలోనూ చర్చలు జరుగుతున్నాయి. కాగా ఇప్పటి నుండే రాజకీయ పార్టీలు నియోజకవర్గాల వారీగా టికెట్ లను కేటాయిస్తూ చకచకా ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం కొంతకాలంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరపున ఎవరు ఫైనల్ అవుతారన్న ప్రచారం ఎక్కువవుతున్న సమయంలో కాసేపటి క్రితమే ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుండి టీడీపీ లీడర్ కింజారపు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను వైసీపీ గెలుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది.

అందులో భాగంగా టెక్కలి నుండి వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య ఆకుల వాణిని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని దువ్వాడ శ్రీనివాస్ ప్రకటించారు, ఇందుకు జగన్ కూడా సమ్మతం తెలిపారని చెప్పడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news