తెలంగాణ పదవ ఆవిర్భావ దినోత్సవం… గవర్నర్ మొట్టమొదటి ప్రసంగం

-

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్స్ లో అధికారికంగా నిర్వహిస్తుంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ సి.పి.రాధాకృష్ణ మాట్లాడుతూ….. “ఈ రోజు మనం మన గొప్ప రాష్ట్రమైన తెలంగాణా 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అని తెలిపారు. ఈ రోజు మనమందరం ప్రతిజ్ఞ చేయాలి. తెలంగాణ, భారత మాత యొక్క సమగ్ర అభివృద్ధి కోసం మేము లంచాలకు దూరంగా ఉంటాము.

లంచాల కోసం ఎన్నటికీ నిమగ్నమై ఉండమని ,మేము పరిపాలనను అత్యంత పారదర్శకంగా ఉంచడానికి ప్రయత్నిస్తామని ప్రతిజ్ఞ చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. కాగా ఇటీవల ఎన్నికల సమయంలో నూతన గవర్నర్ గా సి.పి.రాధాకృష్ణన్ తెలంగాణ బాధ్యతలు చేపట్టారు. కాగా ఈ రోజు మొట్టమొదటి సారి ఆయన తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

Read more RELATED
Recommended to you

Latest news