Telangana : కాళోజీ వాక్కులతో మొదలై.. దాశరథి కవితతో ముగిసిన గవర్నర్ ప్రసంగం

-

సంక్షేమం, అభివృద్ధి జోడుగుర్రాలుగా తెలంగాణ సర్కార్ ప్రగతి పథంలో పయనిస్తోందని గవర్నర్ తమిళిసై అన్నారు. ఎనిమిదిన్నరేళ్ల వయసున్న రాష్ట్రం యావత్ దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తోందని ప్రశంసించారు. తెలంగాణ అభివృద్ధి మోడల్ గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో.. ఇదే నిబద్ధతతో సర్కార్ ముందుకు సాగుతుందని ప్రజలకు హామీ ఇచ్చారు.

చివరగా.. “కరువంటూ.. కాటకమంటూ కనిపించని కాలాలెపుడో……. పసిపాపల నిదురకనులలో ముసిరిన భవితవ్యం ఎంతో..” అంటూ తెలుగు కవి దాశరథి కృష్ణమాచార్యులు చెప్పిన కవితను స్ఫురిస్తూ.. కరవు, కఆకలి లేని ప్రపంచం కోసం, భవిష్యత్ తరాల స్వప్నాలు సాకారమయ్యే ప్రపంచం కోసం మనమంతా కృషి చేద్దామంటూ దాశరథి కవితతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన ప్రసంగాన్ని ముగించారు.

Read more RELATED
Recommended to you

Latest news