పెన్షన్ దారులకు సీఎం కేసీఆర్ తీపికబురు

-

తెలంగాణ రాష్ట్రంలోని పెన్షన్ దారులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.  వృద్ధాప్య ఫెన్షన్లకు అర్హతను 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని తెలంగాణ కేబినెట్ అధికారులను ఆదేశించింది. ఈ నిర్ణయంతో మరో 6,62,000 కొత్త పించన్లు పెరగనున్నాయి.

దీంతో రాష్ట్రంలో మొత్తం పించన్ల సంఖ్య 58 లక్షలకు చేరుకోనున్నది. కుటుంబంలో ఒక్కరికే ఫించను పద్దతిని కొనసాగిస్తూ.. భర్త చనిపోతే భార్యకు భార్య చనిపోతే భర్తకు వెంటనే పెన్షన్ బదిలీ చేయాలని, ఈ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు.దోభీ గాట్లకు, సెలూన్లకు 250 యూనిట్ల ఫ్రీ కరెంటివ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వారంలోగా సంపూర్ణంగా అమలు చేయాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు.

ఇదిలా ఉండగా… ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ సమావేశం… కాసేపటి క్రితమే ముగిసింది. ఇక అంతకుముందు రుణమాఫీ ప్రక్రియను ఆగస్టు 15 నుంచి ప్రారంభం చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news