BREAKING : కౌశిక్ రెడ్డికి కెసిఆర్ బంపర్ ఆఫర్.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ

-

ప్రగతి భవన్ లో ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీలో చేరిన పాడి కౌశిక్ రెడ్డి కి… బంపర్ ఆఫర్ ఇచ్చారు. గవర్నర్ కోటాలో పాడి కౌశిక్ రెడ్డి కి… ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని… తెలంగాణ గవర్నర్ తమిళ సై కి సిఫారసు చేశారు సీఎం కేసీఆర్.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయానికి… క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ గవర్నర్ కు సిఫారస్ చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల ఈ నేపథ్యంలోనే గులాబీ బాస్ చంద్రశేఖర రావు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హుజరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న టిఆర్ఎస్ పార్టీ… ఇప్పటికే పలువురికి కీలక పదవులు కట్టబెట్టింది.. తాజాగా పాడి కౌశిక్ రెడ్డి కి కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news