తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఈ రోజు ఎన్నంటే..?

-

యావత్తు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తున్న కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. అయితే.. తాజాగా.. తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 29,590 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 435 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో 199, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 35, రంగారెడ్డి జిల్లాలో 29 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 872 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.

Corona Virus Update: Active COVID-19 cases in country rise to 19,719 | Zee  Business

అదే సమయంలో 612 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,30,815 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 8,23,884 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,820 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా రాష్ట్రంలో 4,111 మంది మృతి చెందారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news