తెలంగాణా కరోన : 1,416 కేసులు, 5 మరణాలు

-

తెలంగాణాలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్న కరోనా కేసులు కొద్ది రోజులుగా మళ్ళీ పెరుగుతున్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 1,416 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,40,048 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో ఐదుగురు మరణించారు. ఇప్పటి వరకు 1341 మంది కరోనాతో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 18,241 ఉన్నాయి.

వారిలో 15,388 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 2,20,466 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 1,579 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 91.84% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 91.5% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.55%గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 41,675 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 43,23,666 పరీక్షలు చేసారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా 279 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news