తెలంగాణాలో మళ్ళీ భారీగా కరోనా కేసులు

-

తెలంగాణాలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. పక్క రాష్ట్రం ఏపీతో పోలిస్తే కేసుల నమోదు తక్కువే ఉన్నా తెలంగాణా వాసులను కరోనా భయం వీడ లేదు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 1982 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 79,495కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 12 మంది కరోనా వలన చనిపోయారు దీంతో ఇప్పటిదాకా కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 627కు చేరింది. ఇక ఇప్పటిదాకా కరోనా నుండి 55,999 మంది కోలుకోగా నిన్న ఒక్కరోజే 1,669 మంది కరోనా బారి నుండి కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో 22,869 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. అందులో 16,112 మంది హాస్పిటల్స్ లో కాకుండా హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు. ఇక నిన్న ఒక్కరోజే 22,925 శాంపిల్స్ టెస్ట్ చేయగా ఇప్పటిదాకా టెస్ట్ చేసిన శాంపిల్స్ సంఖ్య 6,13,231కి చేరింది. ఎప్పటిలానే జీహెచ్ఎంసీలో భారీగా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే ఇక్కడ 463 కేసులు నమోదు కాగా ఆ తరువాతి స్థానంలో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా 141 కేసులతో నిలిచింది. అలానే రంగారెడ్డి జిల్లాలో కూడా 139 కేసులు నమోదయ్యాయి. అయితే ప్రభుత్వ అంచనాల ప్రకారం సెప్టెంబరు ఆఖరు నాటికి తెలంగాణలో కరోనా పూర్తిస్థాయిలో కనుమరుగవనుంది.

Read more RELATED
Recommended to you

Latest news