తెలంగాణా కరోనా 1,891 కేసులు, 7 మరణాలు

-

తెలంగాణాలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్న కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. అయితే నిన్నటి లానే ఈరోజు కూడా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 1,891 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,08,535 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో 7 మంది మరణించారు. ఇప్పటి వరకు 1208 మంది కరోనాతో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 26,374గా ఉన్నాయి.

carona telangana
carona telangana

ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 1,80,953 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 1,878 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 86.77% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 85.5% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.57 %గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 53,086 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 34,49,925 పరీక్షలు చేసారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా 285 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news