తెలంగాణలో ఇవాళ ఎన్ని కేసులంటే..!

-

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. తాజాగా.. ఆదివారం కొత్తగా 1,590 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా, మరో ఏడుగురు మృతి చెందారు.

దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 23,902కి చేరుకుంది. వీరిలో ఇప్పటివరకు మొత్తం 295 మంది కరోనాతో మృతి చెందగా, కరోనా బారి నుంచి కోలుకొని 12,703 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 10,904 మంది బాధితులు కరోనాతో ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news