తెలంగాణా కరోనా : 593 కేసులు, 3 మరణాలు

-

తెలంగాణలో కరోనా టెస్టులు తక్కువగా చేస్తుండడంతో కేసులు కూడా బాగా తగ్గుతున్నాయి. గతంలో రోజుకు అరవై వేల పరీక్షల దాకా చేసే వారు. కానీ ఇప్పుడు నలబై వేల పరీక్షలకు కాస్త అటూ ఇటుగా మాత్రమే  చేస్తుండడంతో వెయ్యి లోపు కేసులు నమోదవుతున్నాయి. ఈ విషయం మీద కోర్టు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కి కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చినా తీరు మారలేదు. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 24 గంటల్లో 593 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,69,816 కేసులు నమోదు అయ్యాయి.

ఇక నిన్న కరోనాతో ముగ్గురు మరణించారు. ఇప్పటి వరకు 1458 మంది కరోనాతో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 10,022గా ఉన్నాయి. వారిలో 7,946 మంది హోం ఐసోలేషన్‌ లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ఇప్పటి వరకు తెలంగాణలో 2,58,336 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 1058 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో రికవరీ రేటు 95.74% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 93.8% శాతంగా ఉంది. తెలంగాణలో మరణాలు 0.54%గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 33,040 పరీక్షలు చేస్తే ఇప్పటివరకు 54,53,461 పరీక్షలు చేశారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా 119 కేసులు నమోదయ్యాయి. 

Read more RELATED
Recommended to you

Latest news