తెలంగాణా కరోనా.. 1,949 కేసులు, 10 మరణాలు !

-

తెలంగాణాలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్నా కరోనా కేసులు మళ్ళీ భారీగానే పెరుగుతున్నాయి. ఈ మధ్య ఏ రోజూ 2 వేలకు తక్కువగా కరోనా కేసులు నమోదు కావడం లేదు. నిన్న కాస్త తగ్గిన కరోనా కేసుల నమోదు ఇప్పుడు మళ్ళీ పెరిగింది. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 1,949 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,99,276 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో 10 మంది మరణించారు. ఇప్పటి వరకు 1163 మంది కరోనాతో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 27,901గా ఉన్నాయి.

ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 1,70,212 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 2,366 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 85.41% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 83.1% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.58 %గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 51,623 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 32,05,249 పరీక్షలు చేసారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా అంటే 291 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news