కరోనా ఎఫెక్ట్ : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

-

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతకంతకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని కరోనా క్వారంటైన్ సెంటర్లను తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే హైదరాబాద్ లోని నేచర్ క్యూర్ ఆసుపత్రి, క్వారంటైన్ సెంటర్ ను సందర్శించిన హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారని అంటున్నారు.

కరోనా కేసులు రోజు రోజుకీ అధికంగా నమోదవుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో తాజాగా ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.  ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 1078 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,10,819కి చేరింది.  ఇందులో 3,02,207 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 6,900 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.   

Read more RELATED
Recommended to you

Latest news