తెలంగాణలో హోరెత్తుతున్న ప్రచారం, ఆఖరి మూడు రోజులే !

-

తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన రోజు నుండి నేటికీ అదే హీట్ కొనసాగుతోంది. ఎన్నికల్లో గెలవడానికి ఎవరకి వారు ప్రణాళికలు రచించుకుంటూ ముందుకు వెళుతున్నారు. అధికారంలో ఉన్న BRS ను మళ్ళీ గెలిపించడానికి సీఎం కేసీఆర్ అన్నీ తానై తిరుగుతు కష్టపడుతున్నారు. ఇక కాంగ్రెస్ వైఎస్సార్ మరణానంతరం అధికారంలోకి తీసుకురావాలని కసిగా ఉన్నారు. మరోవైపు బీజేపీ దేశమంతా మాకే కావాలంటూ సౌత్ ఇండియా పై కన్నేసింది.. తెలంగాణాలో గెలవబోయేది మేమె అంటూ చెప్పుకుంటూ మోదీ, అమిత్ షా లు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇలా అన్ని పార్టీల ప్రచారానికి మరో మూడు రోజుల్లో శుభం కార్డు పడనుంది. ఎన్నికలకు ఒక్క రోజు ముందు అంటే… నవంబర్ 28వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రచారానికి ముగింపు.

ఇప్పటి వరకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, రేవంత్ రెడ్డి, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాధ్ లు ఇప్పటి వరకు ప్రచారంలో పాల్గొని హోరెత్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news