Telangana : ఎన్నికల కౌంటింగ్..రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధింపు

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది అని ఎన్నికల అధికారులు తెలిపారు. 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు సహా 525 మంది పోటీలో ఉన్నారు. 2,20,24,806 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

120 హాళ్లలో 1855 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.2.18లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు 19 హాళ్లలో 276 టేబుళ్లు సిద్ధంగా ఉన్నాయి.

సాయంత్రం 4 వరకు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. చొప్పదండి, దేవరకొండ, యాఖుత్‌పురా అసెంబ్లీ సెగ్మెంట్లలో 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ,ఆర్మూరు, భద్రాచలం, అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో 13 రౌండ్లలో లెక్కింపు జరగనున్నవి అని ఎన్నికల అధికారి వెల్లడించారు.ఓట్ల లెక్కింపునకు సుమారు 10 వేల మంది సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.

కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, సీసీ కెమెరాల నిఘా పెట్టారు.మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్, మద్యం దుకాణాల బంద్ ఉంటుందని ఎన్నికల కమిషన్ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news