వైసీపీ పార్టీ ఐదేళ్లు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంది : బోండా ఉమా

-

తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.

అధికారం పోతోందని వైసీపీ మంత్రులు, సలహదారులు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు.అధిక అప్పులు చేసి ఏం చేయాలో అర్థం కాక వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసిందని ,అధికారం పోతోందని తెలిసి వైసీపీ నాయకులకు పిచ్చిపట్టినట్లైందని బోండా ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. సోమవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బోండా ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ… 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచారని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అన్ని వర్గాల ప్రజల జీవితాలతో వైసీపీ ఆడుకుందని విమర్శించారు. ఈ రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల అప్పులయ్యాయి. ఈ డబ్బులన్నీ ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ఘోర పరాజయంపాలు కానుందని ,జగన్‌ని ఊరి పొలిమేర దాటించడానికి ప్రజలంతా ఏకమయ్యారని సెటైర్లు వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news