గర్భిణీలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గర్భిణీలు ఎక్కువ మంది సిజెరీయన్ ద్వారా పిల్లలకు జన్మనిస్తున్న సంగతి తెలిసిందే..ఈ ఆపరేషన్ లను తగ్గించాలని కెసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్ర వ్యాప్తంగా గర్భిణీలతో యోగా చేయించాలని ప్రభుత్వం సూత్రపాయంగా నిర్ణయించింది. నార్మల్​డెలివరీల కొరకు యోగా సేఫ్​అని ఇప్పటికే మెడికల్ ఎక్స్​పర్ట్స్‌తో పాటు డాక్టర్లు కూడా ఓ నిర్ధారణకు వచ్చారు.

తొలుత క్షేత్రస్థాయిలో ఆశాలు, ఏఎన్‌ఎంలకు యోగాపై అవగాహన కల్పించనున్నారు. ఆ తర్వాత యోగా టీచర్లు రూపొందించిన ట్రైనింగ్​ వీడియోలను ఆశాలు, ఏఎన్‌ఎంల ట్యాబ్‌లకు పంపిస్తారు. పీహెచ్‌సీ మెడికల్​ఆఫీసర్ల సమన్వయంతో గర్భిణులంతా యోగా చేసేలా ప్లాన్​ సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఫ్యామిలీ వేల్ఫేర్​కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌కు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రత్యేక లింక్‌తో అనుసంధానం కానున్నది.

ప్రతి ఏటా సుమారు 6.50 లక్షల డెలివరీలు జరుగుతుండగా, వీటిలో 50-50 శాతం చొప్పున సర్కార్, ప్రైవేట్‌లో నిర్వహిస్తున్నారు. అయితే దాదాపు 70 శాతం సిజేరియన్లతో దేశంలోనే తెలంగాణ అగ్రభాగంలో ఉన్నది. కరీంనగర్, నిజామాబాద్, ఉమ్మడి వరంగల్​జిల్లాల్లో సిజేరియన్లు మరింత ఎక్కువగా ఉన్నాయని ఇటీవల సర్కార్​అధ్యయనంలోనూ తేలింది. దీంతో నార్మల్​డెలివరీలపై ఫోకస్​పెట్టారు. ఇప్పటికే కేవలం నార్మల్​డెలివరీలు నిర్వహించేందుకు మిడ్​వైఫరీ నర్సులకు ట్రైనింగ్​ఇచ్చి ప్రయత్నాలు చేయడం, రూ. 3 వేల ఇన్సెంటివ్‌లను సర్కార్ అమల్లోకి తెచ్చింది.మరింత మార్పు కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఆపరేషన్ రహిత రాష్ట్రంగా చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news