తెలంగాణ‌లో హైఅల‌ర్ట్‌… అధికారుల‌కు సెల‌వులు ర‌ద్దు

-

తెలంగాణ వ్యాప్తంగా ‌నిన్న రాత్రి నుంచి కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌, ఖమ్మం, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వ‌ర్షం పడుతోంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నారు. చెరువులతో పాటు భారీ ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయింది. అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌ను ప్ర‌భుత్వం అల‌ర్ట్ చేసింది. అధికారులంతా హెడ్ క్వార్ట‌ర్స్‌లో ఉండాల‌ని ఆదేశాలు జారీ చేసింది. వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు దృష్ట్యా అధికారుల‌కు ప్ర‌భుత్వం సెలవులు ర‌ద్దు చేస్తూ ఉత్త‌ర్వులిచ్చింది. లోత‌ట్టు ప్రాంతాల ప్రజ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌ని అధికారుల‌కు సీఎస్ సోమేశ్ కుమార్ సూచించారు. ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. ఇదిలా ఉంటే రానున్న 24 గంటలు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news