కేఆర్‌ఎంబీకి తెలంగాణ మరో లేఖ

-

జల వివాదం నేపథ్యంలో కేఆర్‌ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపుకు త్రిసభ్య కమిటీ ఆమోదం లేకుండా అనుమతించకూడదని… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జల విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి తెలంగాణకు అభ్యంతరం లేదని లేఖలో పేర్కొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ చేసిన 811 tmc లు గంపగుత్త కేటాయింపులని తెలిపిన తెలంగాణ… ఈ విషయాన్ని సుప్రీం కోర్టు కూడా దృవీకరించినట్లు పేర్కొంది.

రెండు రాష్ట్రాల మధ్య పున: కేటాయింపుల అంశం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ జరుపు తున్నందున 2021-22 వాటర్ ఇయర్ నుంచి 50:50 నిష్పత్తిలో నీటి పంపకాలు జరపాలని లేఖలో కోరింది తెలంగాణ. బేసిన్ లో ఉండే ప్రాంతాల అవసరాలు తీరిన తర్వాతనే బేసిన్ ఆవల ప్రాంతాలకు నీటిని తరలించడానికి అనుమతించాలని KRMBకి విజ్ఞప్తి చేసింది తెలంగాణ. కృష్ణా లో వరద ఉన్న కారణంగా అన్ని జల విద్యుత్ కేంద్రాల నుంచి జల విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో చేయడానికి అనుమతించాలని KRMBని కోరింది తెలంగాణ సర్కార్.

Read more RELATED
Recommended to you

Latest news