Telangana : 5 లక్షలకు చేరువలో గ్రూప్‌-4 దరఖాస్తులు

-

తెలంగాణలో గ్రూప్‌-4 పోస్టులకు దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తున్నాయి. బుధవారం నాటికి వీటి సంఖ్య 5 లక్షలకు చేరువైంది. 8,039 గ్రూప్‌-4 సర్వీసుల పోస్టుల భర్తీకి డిసెంబరు 30 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.  బుధవారం సాయంత్రం నాటికి దరఖాస్తుల సంఖ్య 4,97,056కి చేరింది.

రాష్ట్రంలో 783 గ్రూప్‌-2 సర్వీసు పోస్టుల భర్తీకి సంబంధించి బుధవారం నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలైందని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ తెలిపారు. తొలిరోజు సాయంత్రం వరకు 15,405 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు.

మరోవైపు గ్రూప్‌-1 ప్రధాన పరీక్షల ప్రశ్నపత్రం విధానాన్ని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.  సబ్జెక్టు నిపుణుల కమిటీ సిఫార్సులను కమిషన్‌ ఆమోదించింది. ఈ మేరకు పరీక్ష విధానం వివరాలను వెబ్‌సైట్లో పొందుపరిచింది. ప్రధానపరీక్షలో ఒక్కోపేపరుకు 150 మార్కుల చొప్పున మొత్తం 900 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పదోతరగతి స్థాయిలో ఇంగ్లిష్‌ పరిజ్ఞానంపై 150 మార్కులకు అర్హత పరీక్ష నిర్వహించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news