ఇక నుంచి ప్రత్యక్ష విచారణ… తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం..

-

తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 9 నుంచి పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 9 వరకు పాక్షికంగా కేసుల ప్రత్యక్ష విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది హైకోర్టు. రోజూ ఒక ధర్మాసనం, ఒక సింగిల్ బెంచ్ ప్రత్యక్ష విచారణ చేపట్టాలని.. వ్యాక్సిన్ వేసుకున్న న్యాయవాదులకే ప్రత్యక్ష విచారణకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటన చేసింది హైకోర్టు.

కేసు ఉన్న న్యాయవాదులు మాత్రమే విచారణకు హాజరు కావాలని..ఆగస్టు 8 వరకు ఆన్ లైన్ లోనే విచారణ కొనసాగనున్నట్లు పేర్కొంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కోర్టులు, ట్రైబ్యునళ్లకు హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. కోర్టులు, ట్రైబ్యునళ్ల లో సెప్టెంబరు 9వరకు పాక్షిక ప్రత్యక్ష విచారణలు కొనసాగింపు ఉండనున్నట్లు హైకోర్టు పేర్కొంది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఆగస్టు 8వరకు ఆన్ లైన్ లోనే కేసుల విచారణ నిర్వహించాలని వెల్లడించింది. అలాగే న్యాయవాదులు, సిబ్బంది కోవిడ్ నిబంధనలు తప్పనిసరి పాటించాలని హైకోర్టు ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news