Breaking : తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ

-

తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ సంచాలకులుగా ఉన్న ఎ.శరత్‌ను సంగారెడ్డి కలెక్టర్‌గా బదిలీ చేశారు. నల్గొండ జిల్లా కలెక్టర్‌గా ఉన్న ప్రశాంత్‌ పాటిల్‌ను సిద్దిపేట కలెక్టర్‌గా బదిలీ చేశారు. నల్గొండ లోకల్‌ బాడీస్‌ అదనపు కలెక్టర్‌గా ఉన్న రాహుల్‌శర్మకు నల్గొండ కలెక్టర్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న హనుమంతరావు పంచాయతీరాజ్‌శాఖ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు.

PSBs to transfer officers completing 3 years: Central Vigilance Commission

జోగులాంబ గద్వాల లోకల్‌ బాడీస్‌ అదనపు కలెక్టర్‌గా ఉన్న కోయ శ్రీహర్షకు కలెక్టర్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. ఉట్నూరు ఐటీడీఏ పీవోగా ఉన్న అంకిత్‌ను ఏటూరు నాగారం పీవోగా బదిలీ చేశారు. కుమురం భీం ఆసిఫాబాద్‌ లోకల్‌ బాడీ అడిషినల్‌ కలెక్టర్‌గా చహత్‌ బాజ్‌పాయ్‌ను బదిలీ చేశారు. కుమురం భీం ఆసిఫాబాద్‌ లోకల్‌ బాడీస్‌ అదనపు కలెక్టర్‌గా ఉన్న వరుణ్‌రెడ్డిని ఉట్నూరు ఐటీడీఏ పీవోగా బదిలీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news