Telangana : విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ

-

బోధనలో నాణ్యతా ప్రమాణాలు పెంచేలా ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ జరుగుతోంది. ఇందులో భాగంగా పాఠశాల విద్యా బోధనలో నాణ్యతా ప్రమాణాలు పెంచేలా 0 – 19 వరకు విద్యార్థులున్న పాఠశాలకు ఒకరు, 20 నుంచి 60 మంది విద్యార్థులున్న పాఠశాలకు ఇద్దరు, 61 నుంచి 90 వరకు విద్యార్థులున్న పాఠశాలకు ముగ్గురు ఉపాధ్యాయులు ఉండేలా గత ప్రభుత్వం 2015, జూన్‌, 27న జీవో నెం: 17, 2021, ఆగస్టు 21న జీవో నెం: 25 జారీ చేసింది.

విద్యార్థుల సంఖ్య, వారికి మెరుగైన విద్యా బోధనను దృష్టిలో ఉంచుకొని తాజాగా ఆయా పాఠశాలలకు పోస్టులకు కేటాయింపు జరుగును. 1-10 మంది విద్యార్థులున్న పాఠశాలకు ఒకటి, 11 నుంచి 40 వరకు విద్యార్థులున్న పాఠశాలకు రెండు, 41 నుంచి 60 మంది విద్యార్థులున్న పాఠశాలకు మూడు, 61పైన విద్యార్థులున్న పాఠశాలకు ఆ పాఠశాలకు మంజూరైన అన్ని పోస్టులు భర్తీ చేసేలా వెబ్ ఆప్షన్ల కేటాయింపు ఇవ్వనట్లు తెలుస్తోంది. ఒక్క విద్యార్థి లేని పాఠశాలకు అధికారులు ఉపాధ్యాయులను కేటాయించలేదు. ప్రస్తుతం ఉన్న విద్యార్థులకన్నా ఎక్కువ మంది విద్యార్థులు పాఠశాలలో చేరితే పెరిగిన విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయింపులు జరుగుతాయని అధికారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version