సజ్జనార్ మరో సంచలన నిర్ణయం..జర్నలిస్టులకు తెలంగాణ ఆర్టీసీ తీపి కబురు

-

జర్నలిస్టులకు తెలంగాణ ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ తీసుకొస్తున్న పలు మార్పులు ప్రయాణికులతో పాటు సంస్థ కార్మికుల్లోనూ ఉత్తేజాన్ని తీసుకొస్తున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం సజ్జనార్ నిత్యం నూతన సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు..ట్విట్టర్ వేదికగా పలువురు జర్నలిస్టుల సూచన మేరకు సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు..

ఇది వరకు అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులు బస్సు ప్రయాణంలో టికెట్ తీసుకునేందుకు .. ప్రత్యేక బస్సు పాస్ చూపించి 2/3 కన్సెషన్ ఆప్షన్ కింద టికెట్ తీసుకునేవారు. తాజాగా టీఎస్ ఆర్టీసీకి చెందిన వెబ్సైట్ నుంచి కూడా టికెట్లు బుక్ చేసుకునేందుకు రాయితీతో కూడిన అవకాశం ఇచ్చారు సజ్జనార్. TSRTC వెబ్సైట్లో జర్నలిస్టు 2/3 కన్సెషన్ ఆప్షన్ను తీసుకొచ్చారు . ఇదే విషయాన్ని సజ్జనార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.ఈ విషయంపై సూచనలు తెలిపిన జర్నలిస్టులకు సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు…

Read more RELATED
Recommended to you

Latest news