రాముడుకి మొక్కుదాం.. బీజేపీని తొక్కుద్దాం – KTR

-

రాముడుకి మొక్కుదాం.. బీజేపీని తొక్కుద్దామని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వికారాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…ఈ సందర్భంగా మాట్లాడుతూ… కొండా విశ్వేశ్వరరెడ్డి కాదు.. ఆయన విశ్వాసం లేని వ్యక్తి… రంజిత్ రెడ్డి కాదు.. రన్నింగ్ రెడ్డి అంటూ చురకలు అంటించారు.

KTR

వాళ్లిద్దరూ ఎవరో తెలియకపోయినా సరే మీరు గెలిపిస్తే విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారని ఆగ్రహించారు. విశ్వేశ్వర్ రెడ్డి, రంజిత్ రెడ్డి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే విధంగా వ్యవహరించారని మండిపడ్డారు. రంజిత్ రెడ్డి అయితే మరీ దారుణంగా మోసం చేశాడు…మహేందర్ రెడ్డి భార్య వికారాబాద్‌లో ఆనంద్‌ను ఓడిపోయేలా చేసిందని ఫైర్ అయ్యారు. మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి కలిసి పరిగి సమావేశంలో డ్రామాలు చేశారు… యాక్టింగ్‌కు ఆస్కార్ ఇస్తే మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డికి ఇయ్యాలే అంటూ విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

 

Read more RELATED
Recommended to you

Latest news