మొరంచపల్లి – కొండాయి గ్రామాలకు 100 కోట్లు ఇవ్వాలి: ఆర్ఎస్ ప్రవీణ్

-

రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో జనం తీవ్రంగా నష్టపోయారని.. నష్టపోయిన వారికి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు బిఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సోమవారం లకిడికపూల్ బి.ఎస్.పి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బహుజన యాత్రలో ఉండడంవల్ల ఇన్ని రోజులు హైదరాబాద్ కి రాలేకపోయానని అన్నారు. జనంలో తిరిగినప్పుడు జనాలు చెప్పిన కొన్ని విషయాలను ఇప్పుడు మీ ముందుకు తీసుకు వస్తున్నానని తెలిపారు.

మొరంచపల్లి – కొండాయి గ్రామాలకు వంద కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో బడా బాబుల కోసం కేబుల్ బ్రిడ్జిలు కడుతున్నారు.. కానీ గ్రామాలలో ప్రజల కోసం వాగులకు బ్రిడ్జిలు కూడా కట్టడం లేదని ఆరోపించారు. చనిపోయిన వారంతా వాగులు దాటుతుండగా చనిపోయిన వారేనని అన్నారు. గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన ప్రభుత్వ, అసైన్డ్ భూములను ప్రభుత్వం గుంజుకుంటుందని ఆరోపించారు. 30 వేల ఎకరాలు పేద ప్రజల దగ్గర నుండి గుంజుకొని బడాబాబులకు ఇస్తుందని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news