BIG BREAKING: మియాపూర్‌లో 144 సెక్షన్

-

మియాపూర్ లో ఉద్రిక్తతల నేపథ్యంలో 144సెక్షన్ విధించారు పోలీసులు. నేటి నుంచి 29వ తేదీ వరకు మియాపూర్‌ లో 144సెక్షన్ కొనసాగనుంది.. 144 సెక్షన్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సీఐ అవినాష్ మహంతి.

144 Sec in Miyapur

ఇక ఈ వివాదంపై మాదాపూర్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ…మియాపూర్ ప్రభుత్వ స్థలంలోకి ఎవరు రాకూడదు…అందర్నీ కాళీ చేయించి పంపించి వేసామని తెలిపారు. ఇతర జిల్లాల నుంచి చాలా మంది ప్రజలు ప్రలోభాల గురై వస్తున్నారని వెల్లడించారు. ఇది ప్రభుత్వ స్థలం సుప్రీంకోర్టులో కేసు నడుస్తుందని మాదాపూర్ డీసీపీ వినీత్ పేర్కొన్నారు.

ఎవరైతే ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వ స్థలం పైకి తీసుకు వస్తున్నారో అలాంటి వారిని గుర్తిస్తున్నామని… ఈ వివాదం పై ఇప్పటికే మూడు కేసులు నమోదు చేశాము, దర్యాప్తు చేసి మరికొన్ని కేసులు నమోదు చేస్తామన్నారు. ఎవరో కొందరు కావాలనే ఓ వర్గం వారిని రెచ్చగొడుతున్నారని ఆగ్రహించారు మాదాపూర్ డీసీపీ వినీత్.

Read more RELATED
Recommended to you

Latest news