పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 9 మంది ఓటమి..!

-

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి టిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలకు ఈసారి ఎన్నికల్లో ఓటర్లు షాక్ ఇచ్చారు. మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారగా వారిలో తొమ్మిది మంది ఓటమిపాలయ్యారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన హరిప్రియ నాయక్ ,రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వరరావు, కందాల ఉపేందర్ రెడ్డి, జాజుల సురేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, ఆత్రం సక్కు, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. పార్టీ మారిన ఈ 12 మందిపై కాంగ్రెస్ టార్గెట్ చేసింది.

వీరిని చిత్తుగా ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో ఈసారి టిఆర్ఎస్ పై పోటీ చేసిన వీరిలో ఎల్బీనగర్ నుంచి దేవి రెడ్డి సుధీర్ రెడ్డి, మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డిలు మాత్రమే గెలుపొందారు. వీరిలో ఆత్రం సక్కుకు కేటీఆర్ టికెట్ నిరాకరించగా.. పోటీకి దూరంగా ఉన్నారు. మిగతా తొమ్మిది మంది మాత్రం ఓటమి ఫాలయ్యారు. టిడిపి నుంచి టిఆర్ఎస్ లో చేరిన సంర వెంకట వీరయ్య, మెచ్చ నాగేశ్వరరావు సాహితం ఓటమిపాలయ్యారు. బీఆర్ఎస్ కి రాజీనామా చేసి బిజెపిలో చేరిన ఈటల రాజేందర్ హుజురాబాద్, గజ్వేల్ రెండు చోట్ల పోటీ చేయగా రెండు స్థానాల్లో వెనుకబడిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news