దొరల పాలన పోయింది.. ప్రజల పాలన వచ్చింది : భట్టి

-

దొరల పాలన పోయింది.. ప్రజల పాలన వచ్చింది అని సీఎల్పీ నేత భట్టి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మధిర నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేసిన భట్టి విక్రమార్క 33,365 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో అలుపెరుగని బాటసారిగా 1364 కిలోమీటర్లు 115 రోజుల పాటు తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకున్నానని తెలిపారు భట్టి విక్రమార్క.

పార్టీ గెలుపు కోసం ఎంతో శ్రమించినట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని తెలిపారు. మధిర కాంగ్రెస్ అభ్యర్థి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజు పై 33,365 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ 6 గ్యారెంటీల స్కీమ్ ను 6 నెలల్లోనే అమలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news