రేవంత్ రెడ్డి తో సహా ఇద్దరూ మాజీ ఎమ్మెల్యేలపై కేసు నమోదు

-

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో పాటు మాజీ ఎమ్మెల్యేలు వంశీచందర్ రెడ్డి, సంపత్ కుమార్ లపై నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. వీరు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అందింని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గోవర్దన్ పట్వారి ఫిర్యాదుతో వీరిపై కేసు నమోదు అయింది. గోవర్దన్ పట్వారి ఫిర్యాదు మేరకు ఐసీసీ 153, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. 

నాగర్ కర్నూల్ లో ఆగస్టు 14న రేవంత్ రెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. అయితే అధికారులు ముఖ్యంగా పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అధికార పార్టీకి వత్తాసు పలికిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అధికార పార్టీకి వత్తాసు పలికిన అధికారుల జాబితాను సిద్ధం చేస్తున్నామని.. రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రేవంత్ రెడ్డిపై పోలీస్ అధికారుల సంఘం అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్దన్ పట్వారీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 

Read more RELATED
Recommended to you

Latest news