కోమటిపల్లి సర్పంచ్ భూక్యా కుమారి ఆత్మహత్యలో ట్విస్ట్..గ్యాంగ్ రేప్ కారణం !

-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: సుజాతనగర్ మండలం కోమటిపల్లి సర్పంచ్ భూక్యా కుమారి ఆత్మహత్య వెనుక ట్విస్ట్ చోటు చేసుకుంది. భూక్యా కుమారిపై అదే గ్రామానికి చెందిన నవీన్,బుజ్జి అనే మహిళ సాయంతో అత్యాచార యత్నం చేశారని అందుకే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం కోమటిపల్లి గ్రామపంచాయతీ సర్పంచి గ్రామంలో పర్యటన సందర్భంగా నవీన్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.

అతనికి మరో వ్యక్తి బుజ్జి అనే వ్యక్తి సహకరించాడు .అయితే ఇది చూసిన మరో వ్యక్తి భర్తకి సమాచారం అందించారు .దీంతో భర్త అక్కడికి వచ్చి భార్యను తీసుకొని వెళ్ళాడు. ఇది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

కాగా తనపై అత్యాచారయత్నం జరగటం నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో పరువు పోయిందని ప్రజా ప్రతినిధి అయిన కోమటిపల్లి సర్పంచ్ భూక్యా కుమారి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే కొత్తగూడెం ఆసుపత్రి అట్నుంచి హైదరాబాద్ కి తరలించారు. హైదరాబాదులో చికిత్స నిన్న మృతి చెందింది కాగా సర్పంచ్ పై అత్యాచారయత్నానికి పాల్పడిన నవీన్ అతనికి సహకరించిన బుజ్జి పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news