రంగారెడ్డిలో వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య!

-

రంగారెడ్డిలో మరో ఘోరం చోటుచేసుకుంది.యువకుడి వేధింపులు తాళలేక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గానగర్‌లో శుక్రవారం ఉదయం వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకివెళితే.. దుర్గానగర్‌కు చెందిన ఓ మైనర్ బాలిక (17)ను మహేశ్వరం ప్రాంతానికి చెందిన యువకుడు గత కొంతకాలంగా వేధిస్తున్నాడు.

ప్రేమ పేరుతో వెంటబడుతూనే అసభ్యకరమైన మెసేజ్‌లు చేస్తూ మానసికంగా ఆమెను హింసిస్తూ వచ్చాడు. ఈ విషయం ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన పేరెంట్స్ ఆస్పత్రికి తరలించిన ప్రయోజనం లేకుండాపోయింది.బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఆ యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news