Telangana : నేటి నుంచే డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ

-

తెలంగాణ యూత్ కు అలర్ఠ్. నేటి నుంచే డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణలు ప్రారంభం కానున్నాయి.  ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జారీ చేసిన టిఆర్టి నోటిఫికేషన్ కు అనుగుణంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 503 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈనెల 6న పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

మంగళవారం అర్ధరాత్రి 12 నుంచి అభ్యర్థులు దరఖాస్తులు చేసుకునేలా ఏర్పాటు చేసింది. అక్టోబర్ 21 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు పరీక్షల నిర్వహించనున్నారు. ప్రభుత్వ జీవో ప్రకారం వయోపరిమితి సడలింపు వర్తించనుంది. దరఖాస్తు సహా ఇతర వివరాల కోసం అభ్యర్థులు హెచ్టిపి:// స్కూల్ ఎడ్యూ.తెలంగాణ. గౌట్.ఇన్ వెబ్సైట్ ను సంప్రదించాలని అధికారులు తెలిపారు. ఎస్జిటి పోస్ట్ లకు కేవలం డీఎడ్ పూర్తి చేసిన వారే అర్హులు కాగా, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు బీఎడ్ సంబంధిత మెథడాలజీ చేసిన వారే అర్హులు.

Read more RELATED
Recommended to you

Latest news