అల్లం నారాయ‌ణ స‌తీమ‌ణి మృతి

-

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడ‌మీ చైర్మ‌న్ అల్లం నారాయ‌ణ స‌తీమ‌ణి ప‌ద్మ మృతి చెందారు. ఆమె గ‌త కొంత కాలంగా అనారోగ్యం బారిన ప‌డి చికిత్స పొందుతున్నారు. మంగ‌ళ‌వారం తుదిశ్వాస విడిచారు. అల్లం నారాయ‌ణ స‌తీమ‌ణి మృతి వార్త తెలుసుకున్న వెంట‌నే తెలంగాణ‌ సీఎం కేసీఆర్ సంతాపం ప్ర‌క‌టించారు. అల్లం నారాయ‌ణ‌ను సీఎం ఫోన్‌లో ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ఉద్య‌మంలో అల్లం ప‌ద్మ చేసిన సేవ‌ల‌ను గుర్తు చేసారు కేసీఆర్‌.

అల్లం ప‌ద్మ‌ కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ప‌ద్మ మృతికి టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఉద్య‌మంలో ఆమె పోషించిన పాత్ర‌ను గుర్తు చేసుకున్నారు కేటీఆర్‌. ముఖ్యంగా అల్లం నారాయ‌ణ కుటుంబ స‌భ్యుల‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీడియా ప్ర‌తినిధులు సానుభూతి ప్ర‌క‌టించారు. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆకాంక్షించారు. ప‌లువురు రాజకీయ నాయ‌కులు, ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news