ఈ నెల 14న తెలంగాణకు అమిత్ షా..భారీ బహిరంగ సభకు ప్లాన్

-

తెలంగాణలోని జిల్లా, మండల, రాష్ట్ర నేతలతో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. భారీ జన సమీకరణతో సత్తా చాటేందుకు సిద్ధం కావాలని… బూత్ అధ్యక్షుడుసహా ప్రతి పోలింగ్ బూత్ కు 20 మంది చొప్పున కార్యకర్తలు ఉండాలని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

ప్రతి నియోజకవర్గానికి 5 వేల చొప్పున జన సమీకరణ జరుపాలని ఆదేశించారు. కనీవినీ ఎరగని రీతిలో ముగింపు సభను సక్సెస చేయాలని పిలుపు నిచ్చారు బండి సంజయ్‌. రేపటి నుండి కరెంట్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ర్యాలీలు, నిరసనలు చేప్టటాలని ఆదేశాలు జారీ చేశారు.

దళిత బిడ్డ నాగరాజు హత్యోదంతంపైనా ఊరూవాడ నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. ఈ నెల 14 న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ జరుగనుంది. మహేశ్వరం నియోజక వర్గ పరిధిలో భారీ బహిరంగ సభ జరుగనుండగా…ఈ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news