సాంకేతిక లోపంతో హైదరాబాద్ లోనే నిలిచిపోయిన అమిత్ షా విమానం

-

కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు హైదరాబాద్ లోని సీఐఎస్ఎఫ్ 54 వ రైజింగ్ డే ఉత్సవాలకు హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హకీంపేటలో సిఐఎస్ఎఫ్ దళాల గౌరవ వందనం స్వీకరించారు అమిత్ షా. ఉత్తమ సేవలు అందించిన సిఐఎస్ఎఫ్ అధికారులకు రివార్డులు అందజేశారు. అనంతరం హైదరాబాద్ నుండి అమిత్ షా వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది.

దీంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నారు. మరో ఫ్లైట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత కొచ్చికి బయలుదేరుతారు. అప్పటివరకు ఆయన రాత్రి బస చేసిన నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (ఎన్ఐఎస్ఏ ) లోనే ఉంటారు. ఆయన వెంట బండి సంజయ్, కిషన్ రెడ్డి, మరికొందరు బిజెపి నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే విషయమై అమిత్ షా తో పార్టీ నేతలు చర్చిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news