టిఆర్ఎస్ తో పొత్తు కలలో కూడా జరగదు – రేవంత్ రెడ్డి

-

కన్యాకుమారి లో రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్ర లంచ్ బ్రేక్ లో రాహుల్ గాంధీని కలిశారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ – టిఆర్ఎస్ పొత్తులపై స్పందించారు. టిఆర్ఎస్ పార్టీతో పొత్తు కలలో కూడా జరగదని అన్నారు. ఆ ఇంటి కాకి ఈ ఇంటి పై వాలదు..ఈ ఇంటి కాకి ఆ ఇంటింపై వాలదు.. ఒకవేళ వాలితే చంపేస్తామన్నారు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ నే టిఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టంగా చెప్పారని అన్నారు.

8 ఏళ్ల కేసీఆర్ పాపాలను, తప్పులను మోసేందుకు తెలంగాణ కాంగ్రెస్ సిద్దంగా లేదన్నారు. కాంగ్రెస్ ను పొలిటికల్ సీన్ లో లేకుండా చేయడానికి కెసిఆర్, బీజేపి ని ఎంకరేజ్ చేసాడని..ఇప్పుడు అదే బీజేపి కేసీఆర్ పాలిట శాపం గా మారిందన్నారు. తెలంగాణ లో రాహుల్ గాంధీ పాదయాత్ర అక్టోబర్ మూడవ వారంలో ఎంటర్ అవుతుందన్నారు.దేశం లో ఎవ్వరు ఆహ్వానించనించనట్టూగా రాహుల్ గాంధీకి తెలంగాణ కాంగ్రెస్ స్వాగతం పలుకుతుందన్నారు.

తెలంగాణ లో బిజెపిలో లో గెలిచేంత మొనగాళ్ల ఎవరున్నారని అన్నారు. కనీసం‌ పట్టు మని 10 మంది కూడా గెలవలేరని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ పాదయాత్ర తో అటు తెలంగాణ లో..ఇటు కేంద్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news