ప్రజా పాలన కార్యక్రమానికి నోడల్ అధికారుల నియామకం

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని ఐఏఎస్ అధికారులను నోడల్ అధికారులుగా నియమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులను జారీ చేశారు. ఉమ్మడి జిల్లాల వారిగా నోడల్ అధికారులను నియమించారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 06 వరకు ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాల వారిగా నోడల్ అధికారులు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

హైదరాబాద్ -కె.నిర్మల, రంగారెడ్డి-ఇ.శ్రీధర్, వరంగల్ -వాకాటి కరుణ, కరీంనగర్- శ్రీ దేవసేన, మహబూబ్ నగర్ – టి.కె.శ్రీదేవి, ఖమ్మం- ఎం.రఘునందన్ రావు, మెదక్. ఎస్.సంగీత, ఆదిలాబాద్ – ఎం. ప్రశాంతి, నల్గొండ – ఆర్. వి.కర్ణన్, నిజామాబాద్ – క్రిస్టినాను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news