మా కోడలిపై టీడీపీ దాడికి ప్రయత్నించింది..నేను ఊరుకోను -బాలినేని శ్రీనివాసరెడ్డి

-

మా కోడలిపై టీడీపీ దాడికి ప్రయత్నించింది..నేను ఊరుకోనని హెచ్చరించారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒంగోలు సంఘటనపై బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మా కోడలిపై టీడీపీ శ్రేణులు నానా దుర్బాషలాడి దాడికి ప్రయత్నించటంపై టీడీపీ అధినేత చంద్రబాబు సబమాదానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఒంగోలులో భయానక పరిస్దితులు సృష్టించి టీడీపీ లబ్ది పొందాలని చూస్తున్నారని ఆగ్రహించారు. గొడవ జరిగిన ప్రాంతానికి ఏం జరిగిందో సామాన్య వ్యక్తులను అడిగి తెలుసుకోవాలన్నారు.

balineni srinivas

ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నా కుటుంబంపై ఇలాంటి ఘటనలకు పాల్పడటం కరెక్టేనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని ఆగ్రహించారు. నన్ను టచ్ చేస్తే ఊరుకున్నా.. నా ఫ్యామిలీని టచ్ చేసినా కూడా ఊరుకోవాలా..? అని నిలదీశారు. రిమ్స్ లో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్తల దగ్గరకు వెళ్లి మీ సంగతి తేలుస్తామంటూ బెదిరించారు..మా కార్యకర్తలను ఒంగోలు రిమ్స్ లో బెదిరించిన వీడియోలు కూడా స్పష్టంగా ఉన్నాయని చెప్పారు. ఎన్నికలలో లబ్ది పొందేందుకు కావాలనే ప్లాన్ చేసి ఇలాంటి ఘటనకు పాల్పడ్డారని ఆగ్రహించారు. ఒంగోలు ఇష్యూ మీద అన్ని ఆధారాలతో ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు బాలినేని.

Read more RELATED
Recommended to you

Latest news