అక్టోబర్ 15 నుంచి బండి సంజయ్ 5వ విడత “ప్రజా సంగ్రామ యాత్ర”

-

5వ విడత “ప్రజా సంగ్రామ యాత్ర” అక్టోబర్ 15 నుంచి ప్రారంభించబోతున్నామని బండి సంజయ్ ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలవడమే లక్ష్యంగా పనిచేద్దాం. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల భవిష్యత్ నిర్ణయించే ఎన్నిక…. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చే ఎన్నిక. రాజగోపాల్ రెడ్డి ని పక్కా గెలిపిస్తాం అని హామీ ఇస్తున్నానన్నారు.

పాదయాత్రను అడుగడుగునా కేసీఆర్ అడ్డుకుంటున్నాడు. బీజేపీ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్, కేసులు పెడుతున్నారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. సంక్షేమ పథకాలను తీసేస్తారంటూ కొందరు టీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ సంక్షేమ పథకాలను ఆపదు. అవి టీఆర్ఎస్ వైనా… కాంగ్రెస్ వైనా సరే… పేదలకు మరింత మంచి జరిగేలా సంక్షేమ పథకాలను కొనసాగిస్తాం ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించడంతోపాటు అర్హులైన వారందరికీ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో వచ్చేది బిజెపి ప్రభుత్వమేనని తెలిపారు బండి సంజయ్ కుమార్.

 

 

Read more RELATED
Recommended to you

Latest news