బండి సంజయ్ బీజేపీలో జోష్ తెచ్చారు – కిరణ్ కుమార్ రెడ్డి

-

బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బిజెపిలో జోష్ తెచ్చారని అన్నారు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. నేడు బిజెపి నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం నిర్వహించిన సభకు హాజరయ్యారు కిరణ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కారు స్టీరింగ్ తమ చేతిలో ఉందని పతంగి పార్టీ వాళ్ళు అంటున్నారని.. ఆ తాళాలను తీసుకుంటే కారు ముందుకు వెళ్లదని అన్నారు.

ఇక కిషన్ రెడ్డికి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే సత్తా ఉందన్నారు. 2024లో కిషన్ రెడ్డి సైకిల్ పార్టీ వెనకాల ఉన్నారని అప్పుడు తానే అన్నానని.. కానీ ఇప్పుడు తానే బిజెపిలో చేరాల్సి వచ్చింది అన్నారు. బిజెపికి ఎన్నికకు ఎన్నికకు ఓట్లు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. ఏపీలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news