మీరు ఓడిపోతే బీఆర్ఎస్ ను మూసేస్తారా.. కేటీఆర్ కు: బండి సంజయ్ సవాల్

-

లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్‌ ఎంపీగా ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. ఒకవేళ తాను గెలిస్తే కేసీఆర్‌, కేటీఆర్‌ బీఆర్ఎస్ దుకాణాన్ని మూసుకుని ఫామ్‌హౌస్‌కే పరిమితమవుతారా అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు సవాల్‌ విసిరారు. ప్రజాహిత యాత్రలో భాగంగా కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన సంజయ్‌ చొప్పదండి అంబేడ్కర్‌ చౌరస్తాలో నిర్వహించిన రోడ్‌ షోలో మాట్లాడారు.

ఎప్పుడూ రాముడి పేరు చెబుతుంటారని తనను విమర్శిస్తున్నారని రాముడి పేరు కాకపోతే రావణుడి పేరు చెప్పాలా అని కేటీఆర్‌ను ఉద్దేశించి బండి సంజయ్‌ ప్రశ్నించారు. మహారాష్ట్రలో పార్టీ కార్యాలయం తెరిచి కిరాయి కట్టకుండా అక్కడి నేతను మోసం చేసిన చరిత్ర కేసీఆర్‌ది అని విమర్శించారు. కరీంనగర్‌ అభివృద్ధిపై కేటీఆర్‌ చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని తెలిపారు. చర్చకు సిద్ధంగా ఉన్నానన్న సంజయ్.. కేసీఆర్‌ను కూడా తీసుకు రావాలని సవాల్‌ విసిరారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేనిపక్షంలో కరీంనగర్‌లో అడుగుపెట్టనీయబోమని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version