“కారు”ను రజాకార్ల వారసులు నడుపుతున్నారు – బండి సంజయ్‌ ట్వీట్‌

-

Bandi Sanjay :  “కారు”ను రజాకార్ల వారసులు నడుపుతున్నారని బండి సంజయ్‌ ట్వీట్‌ చేశారు. “నమో” అంటే నమ్మకం, కారు పార్టీ క్రూరమైన పాలన నుంచి మోక్షం అని..తెలంగాణ రాష్ట్రంలో అసమర్ధులు, అనర్హులు అందల “మెక్కి” అధికార మదమెక్కి కూస్తున్న “కారు” కూతలని చైతన్య వంతులైన తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారుని పేర్కొన్నారు.

అన్నదాతల చేతికి సంకెళ్ళేసిన అరాచక ప్రభువులు అని.. దళితులపై దాష్టీకానికి తెగబడ్డ దుర్మార్గులు అంటూ నిప్పులు చెరిగారు. గిరిజనులపై జులుం చూపిన దురహంకారులు అని.. రైతుబందుని రాబంధులకి దోచి పెట్టిన దోపిడీ దార్లు అంటూ బండి సంజయ్‌ ఫైర్‌ అయ్యారు. దళిత, బీసీ బంధులని గులాబీ బంధులకి పంచిపెట్టిన దగాకోర్లు అని… సాగునీటి ప్రాజెక్టులలో కమీషన్ల కకృత్తి ఉద్యోగ నియామకాల్లో లీకులు… పరిపాలన చేతకాని అసమర్ధుల చెరలో బందీ కాబడింది తెలంగాణ రాష్ట్రం అంటూ కేసీఆర్‌ సర్కార్‌ పై ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Latest news