బీజేపీ అధికారంలోకి వచ్చాక ఉర్దూ ద్వారా ఉద్యోగం పొందిన వాళ్ళను తొలగిస్తాం – బండి సంజయ్‌

-

టిఆర్ఎస్ పార్టీ గ్రూప్ 1 లో ఉర్దూ చేర్చడాన్ని బిజెపి తీవ్రంగా వ్యతిరేకిస్తోందని…బీజేపీ అధికారంలోకి వస్తే ఉర్దూ ద్వారా ఉద్యోగం పొందిన వాళ్ళని న్యాయపరంగా ఆలోచించి తొలగిస్తామని హెచ్చరించారు బండి సంజయ్‌. గ్రూప్ 1 లో నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని.. అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చేస్తా అన్న కెసిఆర్ కు… రాజ్యాంగంపై మాట్లాడే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో అధికారంలోకి వస్తామని trs, కాంగ్రెస్ పార్టీలు పగటి కలలు కంటున్నాయి.. కేంద్రం నిధులపై పదే పదే విమర్శలు చేసే టీఆర్ఎస్ నేతలు… మీ ప్రభుత్వం ఎన్ని నిధులు విడుదల చేస్తున్నారో ముందు ప్రజలకు చెప్పండని డిమాండ్‌ చేశారు.

ఎంఐఎం ను చంకలో వేసుకుని తిరుగుతున్న పార్టీ టిఆర్ఎస్ అని… ఎంఐఎం మెప్పు కోసమే గ్రూప్ 1 లో ఉర్దూ భాషను చేర్చారని నిప్పులు చెరిగారు.కనీవినీ ఎరుగని రీతిలో పాదయాత్ర ముగింపు సభ ఉంటుందని… ఈనెల 14న జరిగే ముగింపు సభకు అమిత్ షా వస్తున్నారన్నారు బండి సంజయ్‌. ఐదులక్షల జన సమీకరణకు సన్నాహాలు చేస్తున్నాం.. ఎవరెన్ని పగటి కలలు కన్నా…. తెలంగాణలో వచ్చేది బిజెపి ప్రభుత్వమని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news