వైసీపీ నేతలు వీరప్పన్ వారసులు – బండి సంజయ్‌ హాట్‌ కామెంట్స్‌

-

వైసీపీ నేతలు వీరప్పన్ వారసులు అంటూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి బండి సంజయ్‌ దర్శించుకున్నారు. పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. మరోవైపు బండి సంజయ్ బర్త్ డే సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

bandi sanjay on ycp leaders

ఇక తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో గత పాలకులు వీరప్పన్ వారసులు అని.. నిలువు నామాలతో ప్రజలకు పంగ నామాలు పెట్టారని ఫైర్ అయ్యారు.

గత ప్రభుత్వంలో ఏపీలో ఎర్రచందనం దోపిడీతో సర్కార్కే అప్పులిచ్చే స్థాయికి ఎదిగారన్నారు. శేషాచల కొండల్లో ఎర్రచందనం దోపిడీపై నివేదిక కోరతామని తెలిపారు. నాస్తికులకు, అన్యమతస్థులకు పదవులిచ్చి తిరుమల పవిత్రత కు భంగం కలిగించారు. నివేదిక ఆధారంగా జాతీయ సంపదను దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news