BJP: జూన్ రెండో వారంలో బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర…!

-

తెలంగాణలో మరో ఏడాదిన్నర తరువాత ఎన్నికలు ఉండనున్నాయి. అయితే ఇప్పటికే తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీని ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ పార్టీలు విమర్శిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. ఇదిలా ఉంటే బీజేపీ పార్టీ తెలంగాణపై భారీగానే ఆశలు పెట్టుకుంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి తీసుకువచ్చేలా ప్రయత్నాలు చేస్తోంది. ఓ వైపు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రతో రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల యాత్ర పూర్తయింది. యాత్ర సమయంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా రావడం ఆ తరువాత ముగింపు బహిరంగ సభకు అమిత్ షా రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే జూన్ రెండో వారంలో బండి సంజయ్ మూడో విడుత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టాలని భావిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చేపట్టాలనే యోచనలో బండి సంజయ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జిల్లాలో పాదయాత్ర చేపట్టాలని అధిష్టానం అనుమతి కోరిన రాష్ట్ర బీజేపీ. అయితే ఈ యాత్రపై అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news