ప్రభాస్ మిర్చి సినిమా డైలాగులు వేసిన బండి సంజయ్

-

తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 28వ రోజు షాద్ నగర్ నియోజకవర్గంలోని కేశంపేట మండలం తొమ్మిది రేకుల గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ప్రజా సంకల్ప యాత్రకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. బాణాసంచా పేల్చి, డప్పు వాయిద్యాలతో వేడుకగా పాదయాత్రలో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్, తెలుగుదేశం, టిఆర్ఎస్ పార్టీలకు ప్రజలు పాలన అవకాశం కల్పించారని ఇప్పుడు ఒక్క ఛాన్స్ భారతీయ జనతా పార్టీ ఇస్తే ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం అని అన్నారు.బండి సంజయ్ ఇలా ప్రభాస్ మిర్చి మూవీ ఫేమస్ డైలాగ్ చెప్పారు.

ఈ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. తమ ఊరికి రోజులతరబడి నీళ్లు రావడం లేదని, పావలా వడ్డీకి రుణాలు రావడంలేదని, ఇండ్లు ఇవ్వడంలేదని, పెన్షన్లు లేవు అని వాపోయారు. ఆయా సమస్యలు అన్నీ తెలుసుకొని పరిష్కారం కోసం కృషి చేస్తానని భరోసా ఇచ్చారు బండి సంజయ్. మిషన్ భగీరథ పేరుతో ఇంటింటికి ఫిల్టర్ నీళ్లు ఇస్తానన్న కేసీఆర్ మాటలు అన్నీ అబద్ధాలే అన్నారు సంజయ్. నీళ్లు ఇవ్వడం చేతకాదు కాని.. ఊరికి 10 బెల్టుషాపులు పెట్టి తాగండి-ఊగండి అని చెబుతున్నాడు కెసిఆర్ అని విమర్శించారు. ఇంకెన్నాళ్లు టిఆర్ఎస్ అరాచకాలను బరిద్దాం..? ఇదేం న్యాయమని మీరంతా కేసీఆర్ ని, టిఆర్ఎస్ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే పేదల కోసం పని చేస్తాం.. మేము సేవ చేస్తేనే మళ్లీ అధికారం ఇవ్వండి అన్నారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news