సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ..కేసీఆర్ పై చర్యల తీసుకో !

-

సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ రాశారు. మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయమని బీజేపీ ఎంపీ బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇవాళ బహిరంగ లేఖ రాశారు బండి సంజయ్. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యలను బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు.

ఒక్కో బాధిత కుటుంబానికి ఇళ్ల నిర్మాణానికి రూ. 5 లక్షల 4వేలు చెల్లించాలని, నీలోజిపల్లి నుంచి నందిగామ, అగ్రహారం వరకు ఇండస్ట్రియల్ కారిడార్ ను, స్కిల్ డెవలప్మెంట్ కాలేజీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అర్హత లేకున్నా మిడ్ మానేరు ముంపు ప్యాకేజీ పరిహారం తీసుకున్న రాజ్యసభ సభ్యుడు సంతోష్ సహా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే సంబంధిత శాఖ మంత్రి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news