ఈనెల 15న కుల వృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సాయం

-

తెలంగాణలో బీసీ కుల వృత్తుల కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సాయం పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ మాటిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సాయం పంపిణీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ పథకాన్ని గత నెలలో సీఎం ప్రారంభించిన తర్వాత తొలివిడత కింద ఈ నెల 15న నియోజకవర్గానికి 50 కుటుంబాల చొప్పున సాయం అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ పథకం కోసం.. బీసీ కార్పొరేషన్‌కు ఈ ఏడాది బడ్జెట్‌లో ఇచ్చిన రూ.300 కోట్లకు అదనంగా మరో రూ.200 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. తొలివిడత కింద ఈ నెల 15న దాదాపు రూ.50-60 కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశాలున్నట్లు తెలిసింది.

నియోజకవర్గానికి 50 మంది చొప్పున 119 నియోజకవర్గాల్లో 5,950 మంది ఆర్థిక సహాయం అందుకోనున్నారు. మండలానికి పది కుటుంబాలకే అవకాశం ఉంటుంది. దీంతో సర్పంచులు తమ గ్రామంలోని బీసీలకే తొలుత ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నెలలో అవకాశం రాకుంటే వచ్చేనెల జాబితాలో పేరు ఉండేలా చూస్తామని స్థానిక ప్రజాప్రతినిధులు వారికి సర్దిచెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news